బర్త్డే రోజు ఫోటోలు తీసి, నెట్లో అమ్మాయి అసభ్య ఫోటోలు, ముగ్గురి అరెస్ట్
లక్నో: పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఓ యువతి ఫోటోలు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి, ఇంటర్నెట్లో పెట్టిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. సామాజిక అనుసంధాన వేదిక (సోషల్ మీడియా)లో ఫోటోలు పెట్టినందుకు వారిని అరెస్టు చేసినట్లు గురువారం పోలీసులు చెప్పారు.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్కి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని నాలుగు సంవత్సరాల క్రితం తమ పక్క ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంది.
ఆ వేడుకల్లో ఆమె దిగిన ఫొటోలను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి, అశ్లీలంగా మార్చి వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. ఇంటర్నెట్లో ఆ ఫొటోలను చూసిన ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఫొటోగ్రాఫర్ సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.