భారీ వర్షాలు: చెన్నై విమానాల దారిమళ్లింపు
చెన్నై: భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ కావలసిన విమానాలను దారి మళ్లించారు. ముందు జాగ్రత చర్యగా మూడు విమానాలను దారి మళ్లించామని శనివారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్బంలో చెన్నయ్ ఎయిర్ పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడం, వర్షం నీరు చేరిపోవడంతో అధికారులు పలు కోణాలలో ఆలోచించారు. ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదని భావించారు.
సింగపూర్, ప్రాంక్ పర్ట్ నుంచి వస్తున్న రెండు అంతర్జాతీయ విమానాలు, పూణె నుండి వస్తున్న ఒక స్వదేశీ విమానాన్ని బెంగళూరు, తిరుచునాపల్లి విమానాశ్రాయాలకు దారి మళ్లించారు. ఆ విమానాలు బెంగళూరు, తిరుచునాపల్లికి చేరుకున్నాయి.
ఈ మూడు విమానాలలో ప్రయాణించడానికి అప్పటికే ప్రయాణిలకులు చెన్నై ఎయిర్ పోర్టులో సిద్దంగా ఉన్నారు. అయితే అక్కడ ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఎర్పాట్లు చేస్తున్నామని చెన్నైఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.