వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుపాతర పేల్చిన మావోలు: బాలికతోపాటు ముగ్గురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పేలుళ్లతో తెగబడ్డారు.

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పేలుళ్లతో తెగబడ్డారు. నారాయణపూర్‌ జిల్లా తుంనార్‌ వద్ద బుధవారం రాత్రి భద్రతా బలగాలే లక్ష్యంగా అత్యంత ప్రమాదకరమైన ఐఈడీ(ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌)ని పేల్చారు.

ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు.

 Three killed in landmine blast triggered by naxals

మృతి చెందిన వారిలో 15 ఏళ్ల బాలిక, ఇద్దరు మహిళలు ఉండగా, మరో ముగ్గురు మహిళలు, ఓ రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారని ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి తెలిపారు. నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. మృదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

English summary
Two women and a minor girl were killed while four others injured when a pressure landmine, suspected to have been laid by Naxals, went off in a dense forest pocket of Chhattisgarh s insurgency-hit Narayanpur district, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X