వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల చేతిలో పవర్ లేదు: బినామీ ప్రభుత్వం ఉంటే ఇంతే: స్టాలిన్

తమిళనాడులో పోలీసుల చేతిలో పవర్ లేదని, బినామీ ప్రభుత్వం ఉంటే మహిళలకు రక్షణ ఉండదని, అందుకే చిన్నారులను అతిదారుణంగా హత్య చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు పోలీసుల చేతుల్లో అధికారం లేనందున వలనే రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ఆరోపించారు. అమ్మాయిలకు, మహిళలకు రక్షణ కరువయ్యిందని స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు.

తిరువొత్తియూర్ సమీపంలోని ఎర్నాపూర్ లోని సునామి కాలనీలో రితిక (3) అనే బాలికను దారుణంగా హత్య చేశారు. పోలీసులు రితిక మృతదేహాన్ని చెత్త డంపింగ్ యార్డ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాలిక బళ్లంతా తీవ్రగాయాలైనాయి.

<strong>సీఎం,శశికళ వర్గం ఎమ్మెల్యేలకు టైట్ సెక్యూరిటీ: రావద్దండి అంటూ!</strong>సీఎం,శశికళ వర్గం ఎమ్మెల్యేలకు టైట్ సెక్యూరిటీ: రావద్దండి అంటూ!

Three-year old girl murdered in Chennai

రితిక హత్య కేసులో ఓ మహిళతో సహ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు పళని, రాణిల ఇంటికి వెళ్లిన స్టాలిన్ వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

మహిళా భద్రతపై మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ముక్కుపచ్చలారని చిన్నారులు అత్యాచారానికి గురై మట్టిలో కలిసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైల్లో కుర్చుని నడిపిస్తున్న ఈ బినామీ ప్రభుత్వానికి ప్రజాసంరక్షణ పట్టదని ఎద్దేవ చేశారు. ఈ తొమ్మిది నెలల్లో తమిళనాడుకు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారని, సచివాలయంలో ఒక్క ఫైలు ముందుకు కదలకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్టాలిన్ అన్నారు.

<strong>పళనిసామి బలపరిక్ష: కోర్టుకు వెళ్లాలని చెప్పిన గవర్నర్ !</strong>పళనిసామి బలపరిక్ష: కోర్టుకు వెళ్లాలని చెప్పిన గవర్నర్ !

హత్యకు గురైన బాలిక రితిక కుటుంబ సభ్యులను బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పరామర్శించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేలో పదవి పోరు మొదలైయ్యిందని విమర్శించారు.

రితిక హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కూవత్తూరు రిసార్ట్ దగ్గర, పోయెస్ గార్డెన్ లో భారీ సంఖ్యలో పోలీసులు భద్రత కల్పించడంతో చెన్నైలో హత్యలు, దోపిడీలు , అత్యాచారాలు, చోరీలు ఎక్కువ అయ్యాయని తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు.

English summary
The body of a three-year-old girl, who was reported missing on Saturday, has been found from a dumping yard at Ennore on the city outskirts, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X