పన్నీర్ సెల్వం అత్యవసర సమావేశం, ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చ, శశికళకు బర్త్ డే గిఫ్ట్!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో ఆయన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంతో రాజీ అవుదామా ? లేకపోతే ఏం చెద్దాం ? అనే చర్చలు మొదలు పెట్టారు.
బెంగళూరు సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ పుట్టిన రోజు వేడుకలు, మన్నార్ గుడి మాఫియా!
పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, తమిళనాడులోని అన్ని జిల్లాల ప్రధాన కార్యదర్శులు, ప్రముఖ నాయకులు పన్నీర్ సెల్వం నివాసం చేరుకున్నారు. అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాల విలీనం విషయంలో పన్నీర్ సెల్వం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పన్నీర్ సెల్వం వర్గంలోని కీలక నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మైత్రేయన్ శుక్రవారం సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. మా నాయకుడు పన్నీర్ సెల్వం అందరికీ ఆమోదయోగ్యం అయిన తుది నిర్ణయం తీసుకుంటారని, తమిళనాడు ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వివరించారు.
ట్వీస్ట్: కమల్ హాసన్ మద్దతు కోరుతున్న పన్నీర్ సెల్వం వర్గం, అదే జరిగితే శశికళ ఫినిష్!
శశికళ నటరాజన్ పుట్టి రోజు సందర్బంగా పన్నీర్ సెల్వం గట్టి షాక్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. విలీనానికి ఓకే అని చెప్పి శశికళ కుటుంబ సభ్యులకు దెబ్బ కొడతారని సమాచారం. పన్నీర్ సెల్వం ఏం చెబుతారో తెలుసుకోవాలని తమిళనాడు మీడియాతో సహ జాతీయ మీడియా ఆయన ఇంటి ముందు వేచి చూస్తోంది.