వరుస రైలు ప్రమాదాలు: సురేష్ ప్రభు రాజీనామా యోచన, మోడీ సూచన
ఉత్తర ప్రదేశ్లో నాలుగు రోజుల వ్యవధిలో రెండు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లో నాలుగు రోజుల వ్యవధిలో రెండు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేసేందుకు సంసిద్ధులయ్యారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీని సురేష్ ప్రభు కలిశారు. యూపీలో రెండు ప్రమాదాలు జరిగాయి. రాజీనామా చేస్తానని సురేష్ ప్రభు చెప్పగా.. ప్రధాని మోడీ మాత్రం వేచి చూడాలని సూచించారని తెలుస్తోంది.
అంతకుముందే, రైల్వే బోర్డు చైర్మన్ అశోక్ మిట్టల్ రాజీనామా లేఖ చేశారు. తన రాజీనామా లేఖను రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకి సమర్పించారు.బుధవారం జరిగిన కైఫీయత్ ఎక్స్ప్రెస్ ప్రమాదం, నాలుగు రోజుల క్రితం జరిగిన ముజఫర్ నగర్ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ప్రమాదాల కారణంగా అశోక్ మిట్టల్ రాజీనామా చేశారు.
I met the Hon'ble Prime Minister @narendramodi taking full moral responsibility. Hon’ble PM has asked me to wait. (5/5)
— Suresh Prabhu (@sureshpprabhu) August 23, 2017