వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో భూప్రకంపనలు: హడలిపోయిన ప్రజలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ జిల్లాలలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. సుమారు 30 సెకండ్లు భూమి కంపించడంతో స్థానికులు హడలిపోయారు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే స్థానికులు ఎవరి పనిలో వారు నిమగ్నం ఉన్న సమయంలో.. ఒక్క సారిగా చిక్కమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ జిల్లా, ఉప్పలి, ఆల్దూరు, వస్తార్, కబ్బిణి సేతువ, దేవవంద్ర, మలళూరు, మూడబిదరి, దారదహళ్ళి, గుత్తి, గోణిబీడు, కందూరు తదితర ప్రాంతాలలో భూమి కంపించింది.

Tremors in Karnataka

ఇంటిలో వస్తవులు, పాత్రలు నేల మీదపడ్డాయి. పలు ఇండ్ల గొడలు బీటులువారాయి. స్థానికులు భయంతో బయటకు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న చిక్కమగళూరు జిల్లా కలెక్టర్ బి.ఎస్. శేఖరప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. నాసిరకంగా ఉన్న భవనాలలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. భూకంపం వలన ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ శేఖరప్ప తెలిపారు.

English summary
Tremos in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X