విమానంలో ఎయిర్ హోస్టెస్లను లాగి, అసభ్యంగా.. : వ్యాపారి అరెస్ట్
మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఇద్దరు ఎయిర్ హోస్టెస్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ముంబై నుంచి నాగపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్ విమానంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క
నాగపూర్: మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఇద్దరు ఎయిర్ హోస్టెస్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ముంబై నుంచి నాగపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్ విమానంలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. హార్ట్ వేర్ వ్యాపారి ఆకాశ్ గుప్తా ముంబై నుంచి నాగపూర్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి భోజనం సర్వ్ చేసేందుకు వచ్చిన ఎయిర్ హోస్టెస్ల చేతులు పట్టుకుని లాగి, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు ఈ విషయాన్ని విమనా సిబ్బందికి తెలిపారు.
మద్యం మత్తులో ఉన్న ఆకాశ్ గుప్తా.. వారితో కూడా వాగ్విదానికి దిగాడు. దీంతో కెప్టెన్ గోపాల్ సింగ్ మోహన్ సింగ్.. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో విమానం లాండైన వెంటనే మధ్యప్రదేశ్లోని బాలఘాట్కు చెందిన ఆకాశ్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్ గుప్తాపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు.