బస్సులో యువతిపై లైంగిక దాడి,డ్రైవర్, కండక్టర్ అరెస్టు
కర్ణాటక రాష్ట్రంలో ఓ బస్సులో ప్రయాణీస్తున్న ఓ యువతిని లైంగిక దాడికి ప్రయత్నించిన బస్సు డ్రైవర్ , కండక్టర్ ను పోలీసలుు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని యువతి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఫేస్ బుక్ లో పోస్టు
బెంగుళూరు :ప్రభుత్వ రవాణ సంస్థ వాహనంలో ప్రయాణీస్తోన్న ఓ యువతిపై ఆ సంస్థ ఉద్యోగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఆ యువతి తనఫేస్ బుక్ లో పోస్టు చేసింది.దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.
బెంగుళూరు మహనగర సారిగె వాహనంలో ప్రయాణిస్తున్న ఓ యువతిపై బిఎంటిసి ఉద్యోగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరహళ్ళఇ బిఎంటిసి డిపో బస్సులో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఈ నెల 10వ, తేదిన రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో రాగిగుడ్డ నుండి ఉత్తర హళ్ళిక వెళ్తున్న బస్సులో ఓ యువతి ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఆ బస్సులో పదిమంది మహిళలు ఉన్నారు.
ఆమె రూ.20 చెల్లించి టిక్కెట్టు కొన్నారు. ఆమె చేరుకోవాల్సిన గమ్యస్థానానికి రూ. 6 మాత్రమే. టిక్కెట్టు.చిల్లర ఇవ్వాలని ఆమె కండక్టర్ ను కోరింది.అయితే తర్వాత చిల్లర ఇస్తానని కండక్టర్ చెప్పాడు.
తాను దిగాల్సిన స్టేజీ వస్తోండడంతో ఆమె కండక్టర్ ను చిల్లర అడిగారు. అయితే ఆ సమయంలో ఆమె మినహ మహిళలు ఎవరూ కూడ బస్సులో లేరు. ఆ బస్సులో డ్రైవర్ తో పాటు నలుగురు పురుషులే ఉన్నారు.
కండక్టర్ చిల్లర ఇవ్వకపోగా, తనకు లవ్ లెటర్ ఇస్తేనే చిల్లర ఇస్తానని చెప్పాడు. డ్రైవర్ , మిగిలిన ప్రయాణీకులు కూడ కండక్టర్ కు మద్దతుగా నిలిచారు. తన పట్ల డ్రైవర్, కండక్టర్ చేయిపట్టి లాగారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
తన స్టేజీ వద్దకు రాగానే తాను బస్సు దిగి భయంతో పారిపోయానని ఆమె గుర్తుకు తెచ్చుకొన్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన తన కళ్ళముందు కదలాడిందన్నారు. ఈ ఘటనను ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.