గోవా: డ్రగ్స్ ఇచ్చి మహారాష్ట్ర యవతిపై రేప్, వీడియో
పనాజీ: మత్తుమందు ఇచ్చిన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన గోవాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మహిళ తన స్నేహితునితో కలిసి హాలిడేస్ను ఎంజాయ్ చేసేందుకు గతవారంలో గోవాకు వచ్చింది.
స్థానికంగా ఉంటున్న హనీఫ్ మహ్మద్ (25) అనే వ్యక్తి ఆ మహిళ స్నేహితుడికి పరిచయస్తుడు. శనివారం రాత్రి వీరు ముగ్గురూ కలిసి అంజునా ప్రాంతంలోని నైట్ క్లబ్కు వెళ్లారు. క్లబ్లో యువతికి మత్తు మందు ఇచ్చి అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అంజునా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకన్న ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సృహకోల్పోయి ఉన్న యువతిని నోటి నుంచి నురుజు రావడం గమనించిన ఆమె స్నేహితులు చికిత్స నిమిత్తం మాపుసా టౌన్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లనే తన నోటి నుంచి నురుజు వచ్చినట్లు పోలీసులు తమ ప్రాథమికి దర్యాప్తులో పేర్కొన్నారు. అంతేకాదు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి గోవాలో డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
అత్యాచారం చేసిన సమయంలో హానీఫ్ వీడియో కూడా చిత్రీకరించినట్టు పోలీసులు విచారణలో హనీఫ్ ఒప్పకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హానీఫ్తో పాటు యువతి స్నేహితుడుని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.