వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం: భయంతో జనం పరుగులు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం వరుస భూ ప్రకంపనలు సంభవించాయి. శనివారం ఉదయం రెండు గంటల వ్యవధిలో మూడు సార్లు స్వల్పంగా భూమి కంపించింది. భారత జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 6.44 గంటలకు 4.6 తీవ్రతతో మొదటిసారి భూమి కంపించింది.

Two medium-intensity earthquake, epicentred in Kullu, hit the state

ఆ తర్వాత రెండోసారి 7:05 గంటలకు 4.3 తీవ్రతతో, మూడోసారి 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. కుల్లు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఇళ్ల గోడలకు బీటలు వారినట్టుగా తెలుస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో తరచూ భూకంపాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Two medium intensity earthquakes, epicentered in Kullu region of Himachal Pradesh on Saturday jolted the Himalayan state in span of nearly 20 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X