ప్రేమ: పెళ్ళి చేసుకొంటాం లేదంటే ఆత్మహత్యే, ఇద్దరు యువతులిలా..
తామిద్దరం కలిసుంటాం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేం.తమకు సహయం కావాలంటూ ఇద్దరు యువతులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పోలీసులను ఆశ్రయించారు.
మధుర:తామిద్దరం కలిసుంటాం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేం.తమకు సహయం కావాలంటూ ఇద్దరు యువతులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పోలీసులను ఆశ్రయించారు. ఈ సమస్యపై ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకొంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు ఒకే కులానికి చెందిన అమ్మాయిలు చాలా కాలంగా ప్రేమించుకొంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి తమకు బాగా కొడుతున్నారని వారు పోలీసులను ఆశ్రయించారు.
మీరా అనే యువతి ఈ విషయంలో తమకు సహయం కావాలని పోలీసులను ఆశ్రయించింది. మరో యువతిని వివాహం చేసుకొంటానని చెబితే ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించడం లేదని వారు చెబుతున్నారు.
ఓ అమ్మాయి డిల్లీ యూనివర్శిటీ విధ్యార్థిని వీరిద్దరూ కూడ తాము వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నామని, తమకు సహయం చేయాలని మధుర పోలీసులను ఆశ్రయించారు.
అయితే ఈ విషయమై రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను పోలీసులు పిలిపించి చర్చించారు. మరో యువతి పెళ్ళై భర్తతో విడిపోయింది. వీరిద్దరి మద్య ప్రేమ కారణంగానే ఆమె భర్తకు దూరంగా ఉంటుందనే ప్రచారం కూడ ఉంది.
అయితే తామిద్దరం పెళ్ళి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకొంటామని వారిద్దరూ బెదిరించారు. ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకొంటున్నారు.