మోడీ 'డిజిటల్ ఇండియా'కు UC Broswer మద్దతు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభిస్తుంది. తాజాగా ఈ కార్యక్రమానికి టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాడు.
దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మొబైల్ బ్రౌజర్ అయిన యూసీ బ్రౌజర్ ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్ ఇండియాలో తన వంతు పాత్రను పోషిస్తుంది. యూబీ బ్రౌజర్ అప్లికేషన్ "UC-Cricket" క్రికెట్ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దోహదపడుతుంది.
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా యూబీ వెబ్ బ్రౌజర్ "UC-Cricket" పేరిట ఒక క్రికెట్ అప్లికేషన్ను రూపొందించింది. ఆండ్రాయిడ్ కస్టమర్లకు యూసీ బ్రౌజర్ హోం పేజీపై ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది.
"UC-Cricket" అప్లికేషన్ క్రికెట్ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని కలిగిచండంతో పాటు ప్రస్తుతం భారత్లో జరుగుతున్న గాంధీ-మండేలా సిరిస్కు సంబంధించి లైవ్ స్కోర్స్, ప్రివ్యూలు, ఇంటర్యూలు, గణాంకాలు, ఫోటోలు, వీడియోలు అందులో లభిస్తాయి.
ఇంట్లో కూర్చోని ఒకే ఒక్క బటన్ నొక్కడంతో భారత్-దక్షిణాఫ్రికా వన్డే, టెస్టు మ్యాచ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. "Cricket Guessing Game" ద్వారా మీరే మ్యాచ్ విజేతను ఎంపిక చేసి, అద్భుతమైన బహుమతులను సొంతం చేసుకోవచ్చు.
200 మంది తయారీదారులచే 3,000కు పైగా మొబైల్స్కు సంబంధించి ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్లకు యూసీ బ్రౌజర్ అనుకూలంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో ఈ యూసీ బ్రౌజర్ అందుబాటులో ఉంది. 150 దేశాల్లో 500కు పైగా వినియోగదారులు యూసీ బ్రౌజర్ సొంతం.