14 ఏళ్లు జైల్లో ఉన్నా బుద్ధి రాలేదు.. మళ్లీ అదే నేరం!
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 14 ఏళ్ల శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన ఖైదీ మళ్లీ ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో జరిగింది.
అహ్మద్ నగర్ : తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 14 ఏళ్ల శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన ఖైదీ మళ్లీ ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో జరిగింది.
అహ్మద్నగర్ జిల్లా కార్జత్ తహసీల్ పరిధిలోని జలాల్పూర్ ప్రాంతానికి చెందిన లాహుదేవరాం పవార్ తన బంధువు కుమార్తె(5)కు చాక్లెట్ కొనిస్తానని ఉక్కడ్ గామ్ గ్రామానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.
రక్తస్రావమవుతున్న బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడైన లాహుదేవరాం పవార్ ను పింపాల గ్రామంలో పట్టుకున్నారు. నిందితుడు లాహుదేవరాం గతంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు చెప్పారు.
రేప్ కేసులో కఠిన కారాగారశిక్ష వేసినా.. జైలు నుంచి విడుదల అయ్యాక మళ్లీ మరో చిన్నారిపై అఘాయిత్యం చేయడం సంచలనం రేపింది. జైలు జీవితం గడిపినా ఖైదీలో మార్పు రాకపోగా వచ్చిన వెంటనే మరో చిన్నారిపై అత్యాచారం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.