వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేక గురు: కేరళ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. అయితే కేరళ ముఖ్యమంత్రీ శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను అంటూ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఓ ఫోటో .

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రీ శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను అంటూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణి, వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ట్వీట్ చెయ్యడంతో నెటిజన్లు బిత్తరపోయారు.

జయలలితకు వీరవిధేయుడైన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎప్పుడు కేరళ ముఖ్యమంత్రి అయ్యాడు దేవుడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి ట్వీట్టర్ లో ఈ విషయం చెప్పడంతో నెటిజన్లు తికమకపడుతున్నారు.

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. అయితే కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ మాత్రం తానను కలిసింది కేరళ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోతో పాటు ఈ విషయం పోస్టు చేశారు.

కేంద్ర మంత్రి అయి ఉండి రాంవిలాస్ పాశ్వన్ ఇలా పోరపాటు చెయ్యడంతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పోటీ పడుతున్నారా ? అంటూ ఒకరు, తనను కలిసింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియకపోతే దేవుడు కూడా ఆయనను మార్చలేరని మరికోందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వన్ ఆ ట్విట్ డిలీట్ చేసి తనను కలిసింది కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని కరెక్ట్ పోస్టు పెట్టారు. అయినా ఆయన మీద సోషల్ మీడియాలో జోకులు మాత్రం పేలుతూనే ఉన్నాయి.

English summary
The Union Minister for Consumer Affairs, Food and Public Distribution had a meeting with Kerala CM Pinarayi Vijayan and posted a picture of the same on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X