వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యూపీ ఎన్నికలు: నాడు తిరుగులేదు, మూడో దశలో ఎస్పీదే పట్టు!
యూపీలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 69 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
లక్నో: యూపీలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 69 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎటావా నియోజకవర్గంలో అత్యధికంగా 21మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2.41కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ కోసం 25,603 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
ఫరూకాబాద్, హర్దోలి, కనౌజ్, మోయిన్పురి, ఇటావా, కాన్పూర్ దెహత్, ఉన్నవ్, లక్నో, బారాబంకి, సితాపూర్, ఔరయా తదితర జిల్లాల్లో ఎన్నికలు జరుగుుతున్నాయి.
ఈ రోజు 69 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2012లో వీటిల్లో 55 స్థానాలు అధికార ఎస్పీ కైవసం చేసుకుంది. బీఎస్పీ 6, బీజేపీ 5, కాంగ్రెస్ 2 సీట్లలో గెలిచాయి. ఒకరు స్వతంత్ర్య అభ్యర్థి గెలిచారు. ఈసారి కూడా ఇక్కడ ఎస్పీనే ఆధికంగా గెలిచేలా కనిపిస్తోంది.
Comments
up election uttar pradesh assembly elections 2017 samajwadi party lucknow women bsp bjp congress ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017 ఉత్తర ప్రదేశ్ బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ ఎస్పీ
English summary
In 2012 the SP had won 55 of the 69 seats, while BSP, BJP and Congress secured just 6, 5 and 2 seats respectively.
Story first published: Sunday, February 19, 2017, 7:51 [IST]