ఢిల్లీ: అమెరికా యువతిపై క్యాబ్ డ్రైవర్ ఆత్యాచారయత్నం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించడం కోసం భారత్ వచ్చిన అమెరికా యువతి(20)పై ఓ టాక్సీ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ దారణంపై మహారాష్ట్రలో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. జులై 24న బాధిత అమెరికా యువతి ఢిల్లీ వచ్చింది. అక్కడి చిత్తరంజన్ పార్క్ ప్రాంతలో ఓ హోటల్లో బస చేసింది. ఢిల్లీలోని పర్యటక ప్రదేశాలు చూడటం కోసం స్థానికంగా ఒక టాక్సీని అద్దెకు తీసుకుంది. అయితే టాక్సీ డ్రైవర్ దేవ్రాజ్ చవాన్(30) ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.
కాగా, భయంతో ఆమె ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ వెళ్లాక జరిగిన దారుణాన్ని స్నేహితులకు తెలిపింది. వారి సాయంతో జులై 28న డ్రైవర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేరం ఢిల్లీలో జరిగినందున తదుపరి దర్యాప్తు కోసం కేసును చిత్తరంజన్ పార్క్ ఠాణాకు బదిలీచేశామని అహ్మద్నగర్ ఎస్పీ సౌరభ్ త్రిపాఠి తెలిపారు.
'మహారాష్ట్ర పోలీసులు పంపిన ఎఫ్ఐఆర్ పత్రాల కోసం ఎదురుచూస్తున్నాం, అవి అందగానే కేసు నమోదు చేస్తాం' అని ఆగ్నేయ ఢిల్లీ డిసిపి మన్దీప్సింగ్ రంధ్వా తెలిపారు. కేసు నమోదు చేశాక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకుంటామని చెప్పారు.