ఒబామా: రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, మొక్క నాటారు (ఫోటో)
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజ్ ఘాట్ను సందర్శించారు. మహాత్మాగాంధీనికి నివాళులర్పించారు. గాంధీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు.
కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ఘాట్కు వచ్చి నివాళులర్పించడం విశేషం. కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, భారతదేశంలో మహాత్మా గాంధీ ఇద్దరూ శాంతియుత పద్ధతుల్లోనే పోరాటాలు చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
బాపూజీ ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ భారత దేశంలో సజీవంగా ఉందని తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పలువురు ఉన్నాతాధికారులు ఉన్నారు. అనంతరం రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో రావి మొక్కను నాటారు.
Delhi:
US
President
Barack
Obama
plants
a
sapling
at
Rajghat
#ObamaInIndia
pic.twitter.com/6Si8abhtbo
—
ANI
(@ANI_news)
January
25,
2015
గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా గాంధీజీకి నివాళులు అర్పించారు. గాంధీజీ అంటే ఒబామాకు ఎనలేని గౌరవం. అందుకే తన రెండో కార్యక్రమంగానే రాజ్ఘాట్ సందర్శనను ఎంచుకున్నారు.
రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
మహాత్మాగాంధీనికి నివాళులర్పించారు. అందులో భాగంగా మహాత్ముని సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచుతున్న దృశ్యం.
రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
గాంధీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు.
రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
గాంధీ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. అనంతరం సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు.
రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
గాంధీజీ సమాధి వద్ద తల వంచి నమస్కరిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ఘాట్కు వచ్చి నివాళులర్పించడం విశేషం.
రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, భారతదేశంలో మహాత్మా గాంధీ ఇద్దరూ శాంతియుత పద్ధతుల్లోనే పోరాటాలు చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
బాపూజీ ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ భారత దేశంలో సజీవంగా ఉందని తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పలువురు ఉన్నాతాధికారులు ఉన్నారు.
రాజ్ఘాట్ వద్ద మౌనంగా ప్రార్థన, రావి మొక్క నాటారు
అనంతరం రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో రావి మొక్కను నాటారు. గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా గాంధీజీకి నివాళులు అర్పించారు. గాంధీజీ అంటే ఒబామాకు ఎనలేని గౌరవం. అందుకే తన రెండో కార్యక్రమంగానే రాజ్ఘాట్ సందర్శనను ఎంచుకున్నారు.
గతంలో గాంధీజీ శాంతియుత పోరాటానికి ఒబామా ఏనాడో ఆకర్షితులయ్యానని పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తాను చేసిన ప్రసంగంలో కూడా ఆయన గాంధీజీ సిద్ధాంతాలను ప్రస్తావించారు. తొలరోజైన ఆదివారం మొదటగా రాష్ట్రపతి భవన్లో స్వాగతం, సైనిక వందనం స్వీకరించారు.
Delhi:
US
President
Barack
Obama
pays
tribute
to
Mahatma
Gandhi
at
Rajghat
#ObamaInIndia
pic.twitter.com/j41Z4TQsf7
—
ANI
(@ANI_news)
January
25,
2015
అనంతరం హైదరాబాద్ హౌస్కు ఒబామా వెళ్లనున్నారు. ఈ సమావేశంలో భారత్ - అమెరికా మధ్య న్యూక్లియర్, ఢిఫెన్స్కు సంబంధించి ఇరు దేశాధినేతలు చర్చిస్తారు.