వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైలామాలో వెంకయ్య.. విషయం తేలేదెప్పుడో..!

|
Google Oneindia TeluguNews

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగుస్తుండడంతో.. ఆ తర్వాత ఆయన స్థానమేంటనే దానిపై ఇంకా డైలామా కొనసాగుతోంది. గవర్నర్ గా గానీ పార్టీ అవసరాల కోసం గానీ వెంకయ్య సేవలను ఉపయోగించుకోనున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా..! దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇకపోతే వెంకయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న కర్ణాటక నుంచి కూడా ఈ దఫా ఆయనకు ఛాన్స్ లేనట్టే అన్న వాదన వినిపిస్తోంది. రాజ్యసభ కోసం ఇప్పటికే అక్కడ వేరే వాళ్ళ పేర్లు కూడా ఖరారైపోయాయని సమాచారం. అదీగాక పార్టీ తరుపున మూడుసార్లకు మించి రాజ్యసభకు పంపించొద్దన్న పార్టీ నిబంధన ఉన్నందువల్ల వెంకయ్య చూపు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుపై పడింది.

venkaiah naidu in dilemma

అయితే ఇప్పటికే ఒకసారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను టీడీపీ తరుపున రాజ్యసభకు పంపించినందువల్ల ఇప్పుడు మళ్లీ ఇంకో సీటును త్యాగం చేయడానికి టీడీపీ నేతలు సిద్దపడుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. పైగా నిర్మలా సీతారామన్ ను పార్టీ తరుపున రాజ్యసభకు పంపించినా.. పార్టీకి ఒరిగిందేమి లేదన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో ఎప్పటినుంచో వినిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెంకయ్యకు టీడీపీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది తేలాలంటే ఇంకొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.

English summary
central minister venkaiah naidu position is in dilemma. his rajyasabha period is over in coming days. after that there is no clarity in which position he will continues in bjp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X