భర్తను హతం చేసి ఏం చెప్పిందంటే!, ప్రియుడితో కలిసే ప్లాన్.. రాత్రికి రాత్రే
సింగారం గొంతుపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని స్థానిక ఆసుపత్రికి తరలించి.. అతని భార్యను విచారించారు.
అన్నానగర్: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో తలెత్తిన చిన్న వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారడంతో.. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన భార్య, ప్రియుడి సహకారంతో రాత్రికి రాత్రే అతన్ని హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. విల్లుపురం జిల్లా కక్కనూర్ కు చెందిన సింగారం(38) స్థానికంగా ఉన్న ఒక హోటల్లో పరోటా మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సత్య(30)తో పదేళ్ల క్రితం సింగారం వివాహం జరిగింది. వీరిద్దరికి నితీష(4) కుమార్తె కూడా ఉంది.
ఇదే క్రమంలో రోజు లాగే సోమవారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన సింగారం సత్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. కాసేపటికి సింగారం నిద్రలోకి జారుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ తెల్లారి లేచేసరికి సింగారం శవమై కనిపించాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చెప్పింది.
అయితే సింగారం గొంతుపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని స్థానిక ఆసుపత్రికి తరలించి.. అతని భార్యను విచారించారు. దీంతో ప్రియుడితో కలిసి తానే సింగారంను హత్య చేసినట్లు సత్య ఒప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.