వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను హతం చేసి ఏం చెప్పిందంటే!, ప్రియుడితో కలిసే ప్లాన్.. రాత్రికి రాత్రే

సింగారం గొంతుపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని స్థానిక ఆసుపత్రికి తరలించి.. అతని భార్యను విచారించారు.

|
Google Oneindia TeluguNews

అన్నానగర్: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో తలెత్తిన చిన్న వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారడంతో.. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన భార్య, ప్రియుడి సహకారంతో రాత్రికి రాత్రే అతన్ని హత్య చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. విల్లుపురం జిల్లా కక్కనూర్ కు చెందిన సింగారం(38) స్థానికంగా ఉన్న ఒక హోటల్లో పరోటా మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సత్య(30)తో పదేళ్ల క్రితం సింగారం వివాహం జరిగింది. వీరిద్దరికి నితీష(4) కుమార్తె కూడా ఉంది.

wife kills husband with lover in bengaluru

ఇదే క్రమంలో రోజు లాగే సోమవారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన సింగారం సత్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. కాసేపటికి సింగారం నిద్రలోకి జారుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ తెల్లారి లేచేసరికి సింగారం శవమై కనిపించాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చెప్పింది.

అయితే సింగారం గొంతుపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని స్థానిక ఆసుపత్రికి తరలించి.. అతని భార్యను విచారించారు. దీంతో ప్రియుడితో కలిసి తానే సింగారంను హత్య చేసినట్లు సత్య ఒప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

English summary
Satya, A house wife killed her husband with her lover on monday night. In police enquiry she revealed the truth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X