వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ బహిస్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌‌ల కొత్త పార్టీ..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటీవల కాలంలో ఆపార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి గత వారం పార్టీ వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌ను తొలగించిన విషయం తెలిసిందే.

దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలంతా కలిసి కొత్త పార్టీని స్థాపించనున్నారనే వార్తలు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ స్ధాపనపై ఏప్రిల్ 14న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారంతా సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశం ఆప్ మాజీ సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అంతర్జాతీయ లోక్‌పాల్ ఎల్ రామ్ దాస్‌తో పాటు, సామాజిక వేత్త మేథా పాట్కర్‌ను కూడా ఆహ్వానించనున్నారు.

Will Yogendra Yadav & Prashant Bhushan form a new party? Speculations are rife

ఆమ్ ఆద్మీ పార్టీలో 'ప్రశ్నించడం, అసమ్మతిని' తెలియజేసిందుకు గాను ఆప్ జాతీయ కార్యవర్గం పార్టీ వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌ను తొలగించడంపై ఆదివారం నాడు ఆప్‌కు సామాజిక వేత్త మేథా పాట్కర్‌ రాజీనామా చేశారు.

సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి పార్టీలో ఎలాంటి సమస్యలేదని అన్నారు. ఆందోళన పడాల్సిన అవసరంలేదని, తమ పార్టీలో పరిస్ధితి చక్కబడిందని తెలిపారు. డోన్ట్ వర్రీ, ఆల్ ఈజ్ వెల్ అంటూ వ్యాఖ్యానించారు.

English summary
Will Yogendra Yadav and Prashant Bhushan, the two senior Aam Aadmi Party (AAP) leaders who were ousted from the party's National Executive (NE) last week following a bitter clash with the top leadership, float a new party?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X