హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విప్రోలో ఈ ఏడాది భారీ హైక్: 1.72 లక్షల మందికి పెంపు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

: భారత్‌లో మూడవ అతిపెద్ద సాప్ట్‌వేర్ సేవల సంస్ధగా కొనసాగుతున్న విప్రో ఈ ఏడాది ఉద్యోగులకు భారీ వేతనాల పెంపును ప్రకటించింది. జూన్ 1 నుంచి అమలు కానున్న ఈ వేతన పెంపు విప్రో సంస్ధలో పనిచేస్తున్న 1,72,912 మంది ఉద్యోగులకు అమలవుతుందని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ఉద్యోగులకు సరాసరిన 9.5 శాతం వేతనాల పెంపును కంపెనీ ప్రకటించింది. "అర్హులైన ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతనాల పెంపు అమలవుతుంది. ఇండియాలోని ఉద్యోగులకు సరాసరిన 9.5 శాతం, ఆన్‌సైట్ ఉద్యోగులకు సరాసరిన 2 శాతం వరకూ వేతనాల పెంపు ఉంటుంది. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి వేతనాల పెంపు అధికం" అని విప్రో పేర్కొంది.

 Wipro Staff To Get Average 9.5% Salary Hike This Year

మార్చి 31, 2016 నాటికి విప్రో సంస్ధలో 1,72,912 మంది ఉద్యోగులు పే రోల్స్‌లో ఉన్నారు. కాగా విప్రో సంస్ధకు పోటీగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్ధ భారత్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు 6 నుంచి 12 శాతం, ఆన్ సైట్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు 2 శాతం వేతనాలను పెంచిన సంగతి తెలిసిందే.

సాప్ట్‌వేర్ రంగంలో భారత్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీసీఎస్ కూడా తమ ఉద్యోగులకు 8 నుంచి 12 శాతం వేతనాలను పెంచింది.

English summary
Wipro, India's third largest software services firm, on Monday said it will hike salaries of its employees in the country by an average 9.5 per cent this fiscal year, in line with its larger rivals Tata Consultancy Services (TCS) and Infosys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X