మహిళపై గ్యాంగ్రేప్, హత్య చేసి దహనం చేశారు
రోహ్తక్: హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్లో మరో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి మృత దేహానికి నిప్పంటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. కాలుతున్న మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి సగం కాలిన మృత దేహాన్ని కుక్కలు ఛిద్రం చేస్తూ కనిపించాయి.
మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న వారు దాన్ని శవ పరీక్షలకు పంపించారు. ఆమె తలపై బలమైన దెబ్బ తగలడంతో మృతి చెందిందని అంతకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి జవానుకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మందుపాతర పేలిన ఘటనలో మణి అనే జవాను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. సుకుమా జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉండే ప్రాంతంలో పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.