వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై గ్యాంగ్‌రేప్, హత్య చేసి దహనం చేశారు

|
Google Oneindia TeluguNews

రోహ్‌తక్: హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో మరో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసి మృత దేహానికి నిప్పంటించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. కాలుతున్న మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికి సగం కాలిన మృత దేహాన్ని కుక్కలు ఛిద్రం చేస్తూ కనిపించాయి.

Woman brutally gang-raped, murdered and burnt in Rohtak

మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న వారు దాన్ని శవ పరీక్షలకు పంపించారు. ఆమె తలపై బలమైన దెబ్బ తగలడంతో మృతి చెందిందని అంతకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి జవానుకు గాయాలు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మందుపాతర పేలిన ఘటనలో మణి అనే జవాను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. సుకుమా జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉండే ప్రాంతంలో పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

English summary
A woman was allegedly gang-raped and then murdered by her offenders and her dead body burnt in Rohtak. The burning dead body was spotted by passers-by in the farm who intimated the police on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X