భార్యకు మద్యం తాగించి ఫెండ్స్ తో పడుకోవాలని
పూణె: జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త తన భార్యకు బలవంతంగా మద్యం తాగించి స్నేహితులకు శారీరక సుఖం ఇవ్వాలని వేధిస్తున్నాడు. భర్త మీద, అతనికి సహకరిస్తున్న కుటుంబ సభ్యుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని పూణె జిల్లా హదాప్సర్ కు చెందిన ఓ వ్యక్తి భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడని పోలీసులు చెప్పారు. హదాస్సర్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. నిత్యం భర్త ఇంటికి మద్యం తీసుకు వెళ్లేవాడు.
భార్య (40)కి బలవంతంగా మద్యం తాగించేవాడు. తరువాత స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించేవాడు. ఇంటికి వచ్చిన స్నేహితుల పక్కలో పడుకోవాలని భర్యాను వేధించేవాడు. అందుకు ఆమె నిరాకరించింది.
చెప్పిన మాట విననందుకు సిగరేట్ పీకలతో ఆమె శరీరం మీద కాల్చేవాడు. భార్యను హింసిస్తున్న అతనిని కుటుంబ సభ్యులు మందలించకుండా ఇంకా రెచ్చగొట్టేవారు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.
తన భర్త తనను వేశ్య కంటే హీనంగా చూస్తున్నాడని, అతని స్నేహితుల కోర్కెలు తీర్చమని వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. భర్త, ఆమె తల్లి, తమ్ముడు, చెల్లి మీద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. అందరూ తప్పించుకున్నారని వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.