వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను చంపి బాత్రూంలో పాతిపెట్టింది: జీవిత ఖైదు

|
Google Oneindia TeluguNews

మీరట్: కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి బాత్రూంలోనే పాతి పెట్టిన వివాహితకు కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ. 25వేల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో చోటు చేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని గంగానగర్‌కు చెందిన రాజేంద్ర పటేల్, వర్ష(నిందితురాలు) ఇద్దరు భార్య భర్తలు. రాజేంద్ర పటేల్ ఆర్మీ జవానుగా పనిచేస్తుండగా, ఆమె గృహిణి. 2012 మార్చి 24న రాజేంద్ర పటేల్‌కు వర్ష నిద్ర మాత్రలు ఇచ్చింది, అతడు నిద్రలోకి జారుకున్న అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేసింది.

Woman gets life term for killing, burying husband in bathroom

ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి బాత్ రూంలోనే పాతిపెట్టింది. పైన బండలు వేసి ప్లాస్టరింగ్ కూడా చేయించింది. ఆ తర్వాత ఇల్లును మంజు అనే మరో మహిళకు అమ్మేసింది. దీంతో వారు మార్చి 27న గృహ ప్రవేశం చేశారు.

కాగా, బాత్రూం నిర్మాణంపై అనుమానం వచ్చి, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు తెలిసింది. అక్కడ తవ్వకాలు జరపడంతో రాజేంద్ర కుమార్ మృతదేహం బయటపడింది. దీంతో అదే రోజు వర్షను పోలీసులు అరెస్టు చేశారు. కేసును విచారించిన జిల్లా కోర్టు మంగళవారం ఆమెకు జీవిత ఖైదు విధించింది.

English summary
A woman was on Tuesday awarded life term by district court for killing her husband, an Army jawan, and burying the body in the bathroom of their house at Ganganagar locality here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X