వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొంచెపు బుద్దివాళ్ల గురించి మాట్లాడను: గిరిరాజ్‌పై సోనియా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిస్పందించారు. సంకుచిత మనస్తత్వం గలవారి గురించి తాను మాట్లాడబోనని ఆమె అన్నారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. అకాల వర్షాలతో ఇబ్బందులకు గురైన రైతులను ఆమె గురువారంనాడు పరామర్శించారు.

రాజీవ్ గాంధీ నైజీరియా మహిళను పెళ్లి చేసుకుని ఉంటే ఆమెను కాంగ్రెసు అంగీకరించి ఉండేదా, సోనియా తెల్ల మహిళ కాకుంటే అంగీకరించి ఉండేదా అని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Wouldn’t comment on people with a narrow mindset: Sonia Gandhi on Giriraj Singh’s remark

గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యపై నైజీరియా కూడా మండిపడుతోదంి. సింగ్ వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నైజీరియా యాక్టింగ్ హై కమిషనర్ ఓబి ఓకబంగర్ మీడియాతో అన్నారు. గిరిరాజ్ సింగ్‌పై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై బిజెపి ఇరకాటంలో పడినట్లు కనిపిస్తోంది. సింగ్ వ్యాఖ్యలపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. అయితే, గిరిరాజ్ సింగ్‌పై చర్యలు తీసుకోవడానికి మాత్రం ఇష్టపడడం లేదు.

English summary
Reacting to Union minister Giriraj Singh’s racist comment on Congress president Sonia Gandhi, the latter said that she would not like to comment on people who have a ‘narrow mindset’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X