సిరియాలో ఆత్మాహుతి దాడి, 42 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కారుబాంబు పేలుడు ఘటనలో 42 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.సిరియాలో ఈ ఘటన చోటుచేసుకొంది.
డమాస్కన్:కారు బాంబు పేలుడు ఘటనలో 42 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.సిరియాలో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నతిరుగుబాటుదారులు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో 42 మంది ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతులసంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఆల్ బాబ్ నగరం సమీపంలోని సుసైన్ గ్రామంలో రెబల్ కమాండ్ సెంటర్ వద్ద పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో ఆత్మాహుతి దాడి చేసుకొన్నట్టుగా సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం వెల్లడించింది.
ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులు గాయాలపాలయ్యారు. దాడికి ఎవరూ భాద్యులనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
ఆల్ బాబ్ నగరం పై ఆధిక్యం కోసం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గత కొన్నివారాలుగా ప్రయత్నిస్తున్నారు. ఐఎస్ పై పోరాడడానికి గత ఆగష్టులో టర్కీ సిరియాకు బలగాలకు పంపింది.ఈ ఘటనలో గాయపడిన పలువురిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.