వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మా సైనికులను భారత్ చంపేసింది: పాక్ సంచలనం
ఇస్లామాబాద్: భారత సైనికులు ఆదివారం రాత్రి జరిపిన కాల్పుల్లు తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు మృతి చెందారని ఆ దేశ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి భారత దళాలు నియంత్రణ రేఖ వద్ద బీంబర్ సెక్టార్లోని తమ స్థావరాలపై దాడి చేసినట్లు తెలిపారు.
భారత సైనికుల కాల్పులు జరపడంతో తమ దళాలు కూడా కాల్పులు జరిపాయని తెలిపారు. ఆ తర్వాత, భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు చెప్పారు. భారత సైనికులు చేస్తున్న దాడుల్లో ఎక్కువగా తమ పౌరులు చనిపోతున్నారని పాక్ ఆర్మీ, విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.
జమ్మూకాశ్మీర్లోని యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్ సర్జికల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, యూరీ దాడి తర్వాత పాక్ ఇప్పటికే 100సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
Comments
pakistan terrorist killed loc soldiers india ceasefire jammu and kashmir పాకిస్థాన్ ఉగ్రవాది మృతి ఎల్ఓసీ సైనికులు జమ్మూకాశ్మీర్ కాల్పులు
English summary
Seven Pakistani soldiers were killed after Indian forces retaliated along the Line of Control. According to a Geo TV report 7 Pakistani soldiers were killed after Indian forces carried out firing at the Line of Control (LoC) late Sunday night, Inter Services Public Relations (ISPR) said in a statement.
Story first published: Monday, November 14, 2016, 15:28 [IST]