పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి, 10 మంది మృతి: టార్గెట్ మిస్, ఎస్కేప్ !
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ఫ్రావిన్స్ లో భారీ పేలుడు సంభవించడంతో 10 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో సెనేట్ డిప్యూటీ చైర్మన్ మౌలానా అబ్దుల్ గఫూర్ హైదరీ సహ 40 మంది గాయపడ్డారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ఫ్రావిన్స్ లో భారీ పేలుడు సంభవించడంతో 10 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో సెనేట్ డిప్యూటీ చైర్మన్ మౌలానా అబ్దుల్ గఫూర్ హైదరీ సహ అనేక మంది గాయపడ్డారు.
శుక్రవారం గఫూర్ హైదరీ బలూచిస్థాన్ ఫ్రావిన్స్ లోని మస్తంగ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం మద్యాహ్నం ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చారు. ప్రార్థనా మందిరం సమీపంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు.
ఈ ఘటనలో 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. గఫూర్ హైదరీ తో పాటు 40 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించిన సమయంలో గఫూర్ హైదరీ కారులో కుర్చుని ఉన్నారని పోలీసులు చెప్పారు. గఫూర్ హైదరీని లక్షంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగిందని తెలుసుకున్న పోలీసులు ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.