భారతీయుడిని రేప్ చేసిన పాకిస్థానీలు: ఇద్దరికి జైలు
దుబాయ్: మద్యం మత్తులో ఉన్న భారతీయ యువకుడి మీద పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసి మూడు సంవత్సరాల జైలు శిక్షకు గురైన సంఘటన దుబాయ్ లో జరిగింది. భారత దేశానికి చెందిన 20 సంవత్సరాల యువకుడికి న్యాయం చేశామని దుబాయ్ న్యాయస్థానం తెలిపింది.
పాకిస్థాన్ కు చెందిన ఎస్.ఎన్ (24), ఎం.ఎస్ (21) అనే ఇద్దరు కార్మికులు జైలు శిక్షకు గురైనారు. దుబాయ్ చట్టం ప్రకారం ఇద్దరు నిందితుల పూర్తి పేర్లు వెల్లడించలేదు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో దుబాయ్ లోని ఆల్ ముషైస్నా అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
భారతదేశానికి చెందిన యువకుడు, ఇద్దరు పాకిస్థానీలు దుబాయ్ లోని ఆల్ ముషైస్నా ప్రాంతంలో కార్మికులుగా పని చేస్తున్నారు. 2014 సెప్టెంబర్ నెలలో ముగ్గురు ఇంటిలో ఉన్నారు. ఆ సమయంలో ఎస్.ఎన్ అనే యువకుడు భారతీయుడికి మద్యం తాగించాడు.
అంతకు ముందే మద్యంలో మత్తు మందు కలిపాడు. మత్తులోకి జారుకుంటున్న తనను సెక్స్ లో పాల్గోనాలని ఇద్దరు ఒత్తిడి తీసుకు వచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని భారతీయుడు దుబాయ్ పోలీసులకు చెప్పాడు. తరువాత ఇద్దరు కలిసి తన మీద అత్యాచారం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సాక్ష్యాలు నాశనం చెయ్యడానికి మత్తులో ఉన్న తనను బాత్ రూంలోకి తీసుకు వెళ్లి శుభ్రం చేయించి గదిలో వదిలి పెట్టాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ముగ్గరికి వైద్య పరిక్షలు చేయించారు.
ఫోరెన్సిక్ నివేదికలో భారతీయుడి మీద అత్యాచారం జరిగిందని రుజువు కావడంతో పోలీసులు కోర్టులో నివేదికసమర్పించారు. తాను భారతీయుడికి మద్యం గ్లాస్ ఇచ్చానని, అత్యాచారం చెయ్యలేదని ఎస్.ఎన్. కోర్టులో చెప్పాడు. అయితే అతను అత్యాచారం చేశాడని రుజువు అయ్యిందని పోలీసులు తెలిపారు.
దుబాయ్ లో మద్యం తాగి మగాడి మీద ఇద్దరు మగాళ్లు అత్యాచారం చేశారు అని నమోదు అయిన మొదటి కేసు ఇది, నిందితులు పై కోర్టులో అప్పిలు చేసుకొవడానికి 15 రోజులు గడువు ఇచ్చారు. నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విదిస్తు న్యాయస్థానం తీర్పు చెప్పింది.