టీచర్ ను హత్య చేసిన 13 సంవత్సరాల విద్యార్థి
స్పెయిన్: స్కూల్ కు వెళ్లిన బాలుడితో మాట్లాడుతున్న సమయంలో టీచర్ దారుణ హత్యకు గురైన సంఘటన స్పెయిన్ రాజధానిలో జరిగింది. స్పెయిన్ రాజధాని బార్సిలోనాలో జరిగిన ఈ సంఘటనతో స్కూల్ విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు.
టీచర్ ను హత్య చేసిన 13 సంవత్సరాల బాలుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అతని నుండి పదునైన కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బార్సిలోనాలోని లా సాగ్రెరా ప్రాంతంలో జాన్ ఫాస్టర్ సెకండరి స్కూల్ ఉంది. సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో స్కూల్ ప్రారంభం అయ్యింది. ఉదయం 9.30 గంటల సమయంలో బాలుడు స్కూల్ లోకి వెళ్లాడు. ఆ సమయంలో క్లాస్ గదిలోకి వెళ్లిన బాలుడు సహనం కొల్పోయాడు.
బ్యాగ్ లో నుండి బ్లేడ్ లాంటి పదునైన ఆయుధం తీసుకుని ఇద్దరు టీచర్ల మీద, ఇద్దరు విద్యార్థుల మీద దాడి చేశాడు. ఈ దాడిలో ఒక టీచర్ మృతిచెందగా ఇంకో టీచర్, ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైనాయి. విషయం తెలుసుకున్నవిద్యార్థుల కుటుంబ సభ్యులు స్కల్ దగ్గరకు చేరుకున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య చేసిన బాలుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.