మన దేశం చైనా కాలనీగా మారిపోతుంది: పాక్ ఆర్థికవేత్త ఆందోళన
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) వల్ల పాకిస్తాన్ భవిష్యత్తులో ఆ దేశంలో ఓ కాలనీగా మిగిలిపోతుందని పాక్ పొలిటికల్ ఎకనామిస్ట్ ఎస్ అక్బర్ జైదీ వ్యాఖ్యానించారు.
లాహోర్: చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) వల్ల పాకిస్తాన్ భవిష్యత్తులో ఆ దేశంలో ఓ కాలనీగా మిగిలిపోతుందని పాక్ పొలిటికల్ ఎకనామిస్ట్ ఎస్ అక్బర్ జైదీ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళ్లిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మొదలు పెట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్ట్లో భాగంగా పాక్లో చైనా ఎకనమిక్ కారిడార్ పూర్తయిన తర్వాత ఈ పరిస్థితి తప్పకుండా తలెత్తుతుందన్నారు.
చైనా కాలనీగా పాకిస్తాన్ మారిపోతుందని హెచ్చరించారు. సీపీఈసీపై చైనాతో ఎంతో చర్చించాల్సి ఉందన్నారు. పాకిస్థాన్లోని విదేశీ కార్యక్రమాలపై కనీసం పారదర్శకత ఉండాలన్నారు.
చైనా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే పాక్ ఒక బానిసగా మారి సార్వభౌమత్వాన్ని కోల్పోతుందన్నారు. చైనా.. పాకిస్థాన్ భౌగోళిక ప్రాంతాన్ని మాత్రమే ఉపయోగించుకుని పర్షియన్ గల్ఫ్ జలాల్లో పాగా వేస్తుందని అభిప్రాయపడ్డారు.