ఆగ్రహం: హోంమంత్రిని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి చంపారు
బొలివియా: బొలివియాలో మంత్రి దారుణ హత్యకు గురయ్యాడు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్న ఆగ్రహంతో గని కార్మికులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రోడల్ఫోను దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన కలకలం రేపుతోంది.
గని కార్మికులు మంత్రిని కిడ్నాప్ చేసి, కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని బొలివియా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. అధిక రాయితీలు కల్పించాలని, ప్రయివేటు కంపెనీలో పని చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ గని కార్మికులు గత మంగళవారం నుంచి ఆందోళనకు దిగారు.
హైవేలపై ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కార్మికులు పండురో ప్రాంతంలో డిప్యూటీ హోంమంత్రి రొడాల్ఫోను అతడి వ్యక్తిగత సిబ్బందిని అడ్డగించి కిడ్నాప్ చేశారు. అనంతరం అతనిని కొట్టి చంపేశారు. పోలీసులు వంద మందికి పైగా కార్మికులను అరెస్టు చేశారు.