షాక్: అమెరికాపై చైనా కవ్వింపు, ఇది సర్వసాధారణమే
భారత్తో చైనా ఇప్పటికే యుద్దానికి సన్నద్దం అంటూ సంకేతాలను పంపుతోంది. అదే సమయంలో అమెరికాతో కూడ చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది.
న్యూయార్క్: భారత్తో చైనా ఇప్పటికే యుద్దానికి సన్నద్దం అంటూ సంకేతాలను పంపుతోంది. అదే సమయంలో అమెరికాతో కూడ చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది.
అమెరికా నిఘా విభాగానికి చెందిన ఓ విమానాన్ని అడ్డుకొనే చర్యకు చైనా పూనుకొంది. పూర్తిస్థాయిలో ఆయుధాలతో ఉన్న రెండు చైనా యుద్దవిమానాలు అమెరికా నిఘా విమానానికి అత్యంత చేరువగా వెళ్ళి దానిని అడ్డుకొనే ప్రయత్నం చేశాయని అమెరికా అధికారులు ప్రకటించారు.
తూర్పు చైనా సముద్రంపై ఎగురుతున్న తమ నేవీ నిఘా విమానం యూఎస్ఈసీ-3ి చైనాకు చెందిన జె10 రకానికి చెందిన విమానాలు అత్యంత సమీపంగా వచ్చాయని దీంతో తమ విమానం మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
అయితే ఈ సమయంలో చైనా యుద్ద విమానంలో భారీస్థాయిలో పేలుగు పదార్థాలున్నాయని మరిందత దగ్గరగా వచ్చి ఉంటే ఏదైనా ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు.
అయితే, ఇలా అప్పుడప్పుడు జరగడం సాధారణమని, ఉద్దేశ్యపూర్వకంగా చేసిన చర్య కాదని చైనా ప్రతినిధులు ప్రకటించారు. అయితే కేవలం 300 అడుగుల సమీపంలోకి చైనా విమానం రావడం తమను ఆళోచనలో పడేసిందని అమెరికా అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.
గతంలో కూడ రెండుసార్లు చైనాకు చెందిన ఎస్యూ-30 యుద్ద విమానాలు ఇలాగే తమ విమానం విషయంలో జోక్యం చేసుకొన్నట్టు వారు చెబుతున్నారు.