ఉబెర్ క్యాబ్ సర్వీస్పై యుఎస్ కోర్టులో దావా: ఢిల్లీ బాధితురాలు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఆన్లైన్ కారు సర్వీస్ సంస్ధ 'ఉబెర్' పై న్యూఢిల్లీకి చెందిన ఉబెర్ బాధితురాలు గురువారం అమెరికాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ప్రయాణీకులకు తగిన భద్రతా విధానాలు కల్పించడంలో ఆ సంస్ధ విఫమైందంటూ తన దావాలో ఆరోపించారు.
ఈ దావాలో ఫైనాన్సియల్ ఎగ్జిక్యూటివ్ పేరుని ప్రస్తావించలేదు. అమెరికా తర్వాత భారత్లోనే ఉబెర్ ఎక్కువ పట్టణాల్లో తన సర్వీసులను అందిస్తుంది. భారత్లో ఉబెర్ టాక్సీ సంస్ధ ఏడాదికి సుమారు 6 నుంచి 9 బిలియన్ల డాలర్లు వ్యాపారం చేస్తుంది.
ఐతే ఈ దావాపై ఉబెర్ ప్రతినిధులు మాత్రం స్పదించ లేదు. న్యూఢిల్లీలో ఓ మహిళా ఉద్యోగిపై ఉబెర్ టాక్సీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉబెర్ క్యాబ్ సర్వీసులను దేశ వ్యాప్తంగా నిషేధించింది. ఆ సంస్ధపై నిషేధం విధించాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.