మోడీని పక్కనపెట్టి, ఇయర్ ఆఫ్ ది అవార్డుకు ఎంపికైన ట్రంప్, గతంలో కూడ ఇలానే
టైమ్ మేగజైన్ నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తి ఓట్లు పొందిన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పక్కనపెట్టి ఇయర్ ఆఫ్ ది అవార్డుకు అమెరికా అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టనున్న ట్రంప్ ను ఎం
వాషింగ్టన్ :టైమ్ మేగజైన్ నిర్వహించిన అత్యంత ప్రబావంతమైన వ్యక్తుల్లో అత్యధిక ఓట్లను పొందిన ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీని పక్కకు నెట్టి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్ ట్రంప్ ను టైమ్ మేగజైన్ ఇయర్ ఆఫ్ ది పర్సన్ గా ఎంపిక చేసింది.
టైమ్ మేగజైన్ నిర్వహించిన సర్వేలో ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీకే అత్యధికంగా ఓట్లు వచ్చాయి. ఓటింగ్ పూర్తయ్యే సమయానికి 18 శాతం ఓట్లతో మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. టైమ్ మేగజైన్ ప్రకటించిన ఇయర్ ఆఫ్ ది అవార్డు దక్కించుకొన్న ట్రంప్ కు కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన మోడీని పక్కనయ పెట్టి ట్రంప్ కు ఆ పత్రిక ఎడిటర్లు ఎంపిక చేశారు.
గతంలో కూడ ఇలానే చేశారు
గత ఏడాది కూడ ఇయర్ ఆఫ్ ది అవార్డుకు నిర్వహించిన ఓటింగ్ లో ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యధిక ఓట్లు వచ్చాయి.గత ఏడాది కూడ టైమ్ మేగజేన్ నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది మోడీకే ఓటుచేశారు. సుమారు 21 శాతానికి పైగా ఓట్లు మోడీకి దక్కాయి. అయితే గత ఏడాది ఆయనకు ఇయర్ ఆప్ ది పర్సన్ అవార్డుకు ఎంపిక అవుతారని భావించినా ఆ పత్రిక ఎడిటర్లు మాత్రం జర్మనీకి చెందిన ఏంజిలా మోర్కెల్ ను ఎంపిక చేశారు.
ఈ ఏడాది కూడ ఓటింగ్ లో దూసకు వెళ్ళాడు మోడీ,.ట్రంప్ సహా మిగిలినవారంతా మోడీకి చాల దూరంలో ఉన్నారు. వీరి మద్య సుమారు 11 శాతం ఓట్ల తేడా ఉంది.అమెరికాలోని కాలిఫోర్నియా,న్యూజెర్సీ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మోడీకి ఓటుచేశారు. అయితే ఈ ఏడాదైనా మోడీకి ఇయర్ ఆప్ ది అవార్దు వరిస్తోందని భావించినా, నిరాశే మిగిలింది. టైమ్ మేగజైన్ పత్రిక ఎడిటర్లు మాత్రం ట్రంప్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.