వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమత్రా దీవుల్లో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 6.5 నమోదు

ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో ఆదివారం నాడు భూకంపం చోటుచేసుకొంది. బెంగ్‌కులు ప్రాంతానికి 73 కి.మీ. దూరంలోని భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జకార్తా: ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో ఆదివారం నాడు భూకంపం చోటుచేసుకొంది. బెంగ్‌కులు ప్రాంతానికి 73 కి.మీ. దూరంలోని భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

భూకంపలేఖినిపై 6.5 తీవ్రత నమోదైంది. అయితే ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు.

Earthquake of magnitude 6.5 strikes west off Indonesia's Sumatra; tremors felt in Singapore

సమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం కారణంగా సింగపూర్‌లో కూడ అక్కడక్కడ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. ప్రజలంతా భయంతో ఇళ్ళలో నుండి బయటకు వచ్చారు.

ఎప్పుడు ఏం జరుగుతోందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ళనుండి బయటనే నిరీక్షిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.

గత ఏడాది డిసెంబర్‌లో ఇండోనేషియాలోని ఏస్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందమంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

తాజాగా చోటుచేసుకొన్న భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్గం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉందని అధికారులు ప్రకటించారు.

English summary
An earthquake of magnitude 6.5 struck west of Indonesia’s island of Sumatra on Sunday (Aug 13) but there was no tsunami risk, seismologists said as panicked residents fled their homes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X