మార్స్లో భూగర్భ జలం: ఇటలీ పరిశోధకుల తాజా రీసెర్చ్
లండన్: మార్స్ (అంగారకుడి)లో భూగర్భ జలం ఉందని పరిశోధకులు తాజాగా గుర్తించారు. భూమి మీద సూకష్మ జీవుల నివాసానికి సహకరించే పరిస్థితులే అక్కడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంగాకరకుడిలో గల ఫిర్సాఫ్లో గల అరేబియా టెర్రా యొక్క ఈక్విటోరియల్ లేయర్డ్ డిపాజిట్స్ను (ఈఎల్డీ) పరిశీలించారు.
నివాస యోగ్యతకు ఎంత వరకు ఉపయోగపడుతుందని ఇక్కడి పర్వత ప్రాంతాల్లో పరిశోధన చేశారు. ఈఎల్డీలు ఉండే ఫలకంపై అరుదైన మట్టి దిబ్బలు, ఇసుక తిన్నెలు, పలు నిక్షేపాలు, అరుదైన కొండలు, సమతల ప్రాంతాలను పరిశోధకులు గుర్తించారు.
ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ప్లానెటరీ సైన్సెస్, ఇంటలీకి చెందిన మోనికా పాండ్రెల్లి, ఆమె సహచరులు ఈ మట్టిదిబ్బలు, ఇసుక తిన్నెలు, సమతల ప్రాంతాలు ఏర్పడిన విధానాన్ని వివరించారు. నీటి ఊటల ఉనికి, నీరు ఆవిరైన ప్రాంతాల గుర్తింపు లాంటివి ఇక్కడ హైడ్రోలాజికల్ సైకిల్(జలచక్రం) ఉనికిని తెలియజేస్తున్నాయన్నారు. ఈఎల్డీ నిక్షేపణకు ఇక్కడి భూగర్భ జలం ఒడిదుడుకులు మేజర్ ఫ్యాక్టర్ కావొచ్చని భావించారు.