ఘోర రైలు ప్రమాదం: 8 మంది మృతి (ఫోటోలు)
బవేరియా: దక్షిణ జర్మనీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
గాయపడ్డ వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మునిచ్కు 60 కిలోమీటర్ల దురంలో ఉన్న బవేరియా ప్రాంతంలోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ రైలు పూర్తిగా పట్టాలు తప్పింది.
దీంతో రైలుకు సంబంధించిన అన్ని బోగీలు తిరగబడటంతో ఎక్కువ మందికి గాయపడినట్లు రెస్కూ సిబ్బంది పేర్కొన్నారు. రైలు బోగీల శిథిలాల కింద చిక్కున్న ప్రయాణికులను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రమాద ప్రాంతానికి ఎనిమిది రెస్క్యూ హెలికాప్టర్లు చేరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్పై వెళ్లుతున్న రెండు రైళ్లు రోసెన్హామ్, హోజ్కిర్చిన్ స్టేషన్ల మధ్య ఢీ కొన్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇంతటి పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లు రెండు కూడా పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుంటాయి. అయితే ప్రస్తుతం జర్మనీలో కార్నివాల్ సీజన్ కావడంతో సెలవు దినంగా ప్రకటించారు.
జర్మనీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ, 150 మందికి గాయాలు
గాయపడ్డ వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మునిచ్కు 60 కిలోమీటర్ల దురంలో ఉన్న బవేరియా ప్రాంతంలోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ రైలు పూర్తిగా పట్టాలు తప్పింది.
జర్మనీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ, 150 మందికి గాయాలు
దీంతో రైలుకు సంబంధించిన అన్ని బోగీలు తిరగబడటంతో ఎక్కువ మందికి గాయపడినట్లు రెస్కూ సిబ్బంది పేర్కొన్నారు. రైలు బోగీల శిథిలాల కింద చిక్కున్న ప్రయాణికులను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
జర్మనీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ, 150 మందికి గాయాలు
ఇప్పటికే ప్రమాద ప్రాంతానికి ఎనిమిది రెస్క్యూ హెలికాప్టర్లు చేరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్పై వెళ్లుతున్న రెండు రైళ్లు రోసెన్హామ్, హోజ్కిర్చిన్ స్టేషన్ల మధ్య ఢీ కొన్నాయి.
జర్మనీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ, 150 మందికి గాయాలు
గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇంతటి పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లు రెండు కూడా పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుంటాయి. అయితే ప్రస్తుతం జర్మనీలో కార్నివాల్ సీజన్ కావడంతో సెలవు దినంగా ప్రకటించారు.