వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై దాడులు చేయండి: టెర్రరిస్ట్‌లకు పాక్ ఐఎస్ఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ పైన దాడులు జరపాలని పాకిస్తాన్‌కు చెందిన ఏజెన్సీ ఐఎస్ఐ... ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (ఎల్ఈటి), హిజుబుల్ ముజహిదీన్, జైష్ ఏ మహ్మద్ (జెఈఎం) సంస్థలకు సూచించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇందుకు సంబంధించి భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చిందని తెలుస్తోంది. సదరు మూడు తీవ్రవాద సంస్థలతో ఐఎస్ఐ సమావేశాలు నిర్వహించిందని, భారత్ పైన దాడులు నిర్వహించాలని సూచించిందని సమాచారం.

ISI asks terrorist to attack India

ఆంగ్ల మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... లష్కరే తోయిబా, హిజుబుల్ ముజహిదీన్, జైష్ ఏ మహ్మద్‌కు చెందిన దాదాపు ముప్పై మంది మిలిటెంట్స్‌తో ఐఎస్ఐ సమావేశమైంది. ఈ సమావేశం పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లోని క్యాంపులో జరిగింది.

ఈ సమావేశం కోసం మిలిటెంట్స్ పెషావర్ నుంచి పీఓకే క్యాంపుకు వచ్చారని తెలుస్తోంది. ఈ సమావేశాన్ని నిర్వహించింది ఎవరో కూడా గుర్తించారని సమాచారం. భారత్ పైన దాడి చేసేందుకు ఆ మూడు తీవ్రవాద సంస్థలకు సహాయసహకారాలు అందించేందుకు కూడా ఐఎస్ఐ సిద్ధమైందని తెలుస్తోంది. మన అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు.

English summary
India received intelligence reports that Pakistan's intelligence agency ISI held meeting with terror outfits in PoK and ask them to carry out attacks in India, media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X