ఐఎస్ రాక్షసం: బాలుడిని రిమోట్తో పేల్చేశారు
లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఓ నాలుగేళ్ల బాలుడిని రిమోట్ కంట్రోల్ డివైజ్ను ఉపయోగించి పేల్చేశారు. ఈ దారుణం ఇరాక్లోని అల్ షిర్కత్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆ బాలుడి శరీరానికి బాంబులు అమర్చి పేల్చడంతో అతని శరీర భాగాలు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి. ఉగ్రవాదులు పేలుడు కోసం రిమోట్ కంట్రోల్ డివైజ్ను ఉపయోగించారని డెయిలీ మెయిల్ తన కథనంలో వెల్లడించింది.
ఇటీవల ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో ఈ బాలుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆ బాలుడి తండ్రిని చంపేశారు.
ఇసా డేర్ అనే బ్రిటీష్ బాలుడు చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఒక రోజు తర్వాత ఈ బాలుడిని ఉగ్రవాదులు హత్య చేశారు. కాగా, అల్ షిర్కత్ జిల్లా గత జూన్ నుంచి ఉగ్రవాదుల స్వాధీనంలో ఉండిపోయింది. ఇక్కడ ఇప్పటికే పదుల సంఖ్యలో వృద్ధులు, చిన్నారులు ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు.