వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికలాంగులపై ఉన్మాది దాడి: 19 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరం శివారులో ఉన్న సాగమిహరలోని ఓ వికలాంగుల ఆశ్రమంపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా చేసిన ఈ దాడిలో 19 మంది మరణించగా, 25 మంది దాకా గాయపడ్డారు.

గాయపడినవారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడి చేసిన తర్వాత దుండగుడుపోలీసులకు లొంగిపోయాడు. అతన్ని ఆశ్రమం పూర్వ ఉద్యోగిగా గుర్తించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ పని తానే చేశానంటూ 26 ఏళ్ల యువకుడు లొంగిపోయాడు.

Murder - crime

కత్తి ధరించిన ఓ వ్యక్తి లోనికి వస్తున్నాడని తమకు తెల్లవారు జామును రెండున్నర గంటల సమయంలో ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. వికలాంగులంతా అంతమై పోవాలని అనుమానితుడు అన్నట్లు చెబుతున్నారు. నిందితుడిని సతోషి ఉమాత్సుగా గుర్తించారు.

English summary
At least 19 people were killed and dozens wounded in Japan after a knife-wielding man went on a rampage at a care centre for the mentally disabled early today, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X