షాక్: జపాన్లో రాత్రికి రాత్రే 50 అడుగుల పైకి భూమి, ఆప్ఘన్లో 52 మంది మృతి
టోక్యో: జపాన్లో రాత్రికి రాత్రే ఓ చోట భూమి 50 అడుగుల పైకి వచ్చింది! దాదాపు వెయ్యి అడుగుల పరిధిలో ఇది జరిగింది. తాము పడుకునేటప్పుడు లేని భూమి ఒక్కసారిగా రావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
సముద్ర మట్టానికి ఎత్తుగా దాదాపు వెయ్యి అడుగుల పరిధిలో భూమి పైకి వచ్చింది. జపాన్లోని ఐస్ లాండ్ హోక్కాయిడో ప్రాంతంలో రాత్రికి రాత్రే భూమి పైకి వచ్చింది. మంచు కరగడం లేదా ఇతర కారణాల వల్ల ఇది జరిగి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మూడు నాలుగు రోజుల క్రితం జరిగింది.
30 నుండి 50 మీటర్ల ఎత్తుకు, వెయ్యి నుండి పదహారు వందల నలభై అడుగుల పొడవుతో, వంద మీటర్ల వెడల్పుతో పుట్టుకు వచ్చింది. అయితే, రాత్రి పూట ఆ ప్రాంతంలోని భూమి పైన ఏదో జరుగుతున్నట్లుగా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు.
ఆప్ఘనిస్తాన్లో కొండచరియలు విరిగి 52 మంది మృతి
ఆప్ఘనిస్తాన్ ఈశాన్య ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 52 మంది మృతి చెందారు. బదక్షాన్ ప్రావిన్సులో పెద్ద ఎత్తైన కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. విపరీతమైన మంచు పేరుకుపోవడంతో ఈ ప్రావిన్సుకు రహదారులు మూసుకుపోయాయి. కేవలం వాయువ్య మార్గం ద్వారా మాత్రమే వెళ్లే అవకాశముంది.