పార్లమెంట్ వద్ద దాడి చేసింది బ్రిటన్ వ్యక్తే: ప్రధాని థెరిస్సా
బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడి, పోలీసుల చేతిలో హతమైన దుండగుడు బ్రిటన్లో జన్మించిన వ్యక్తేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే వెల్లడించారు. అతడి గురించి వివరాలను ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు.
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడి, పోలీసుల చేతిలో హతమైన దుండగుడు బ్రిటన్లో జన్మించిన వ్యక్తేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే వెల్లడించారు. అతడి గురించి వివరాలను ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు గురువారం తెలిపారు.
లండన్ దాడి మా పనే: ఇస్లామిక్ స్టేట్ ప్రకటన
దుండగుడు బ్రిటన్లో జన్మించిన వ్యక్తి అని తేలిందని, కొన్నేళ్ల క్రితం అతడిపై హింసాత్మక తీవ్రవాదానికి సంబంధించి విచారణ జరిగిందన్నారు. ఈ కేసు ప్రత్యేకమైనదని, ప్రస్తుతం అతడు ఇంటలిజెన్స్ పరిధిలో లేడన్నారు.
ముందస్తు దాడిపై ఎలాంటి సూచన గానీ ఆధారం గానీ ఇంటలిజెన్స్ వర్గాలకు అందలేదన్నారు. కాగా, నిన్న పార్లమెంట్ వద్ద దాడి జరిగింది. ఆ సమయంలో పార్లమెంటులోనే సభ్యులు ఉన్నారు.
ఈ రోజు పార్లమెంట్ తిరిగి సమావేశమైంది. థెరిసా మే పార్లమెంటులో ఉగ్రదాడి గురించి మాట్లాడారు. బ్రిటన్ ప్రజలు ఐకమత్యంతో ఉండాలని, తమ దేశం విలువలు ఉగ్రవాదాన్ని ఓడించగలవని నిరూపించాలన్నారు.