శ్రీలంక: ఎస్టేట్లో 200మంది సజీవ సమాధి(ఫోటోలు)
న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా శ్రీలకంలోని సెంట్రలో బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కొండ చరియలు కింద పడి 200 మంది సజీవ సమాధి అయ్యారని విపత్తు నిర్వహాణ అధికారులు గురువారం వెల్లడించారు.
కొండ చరియలు విరిగిన పడిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో అక్కడ నివాసం ఉన్న 150 కుటుంబాలకు చెందిన కార్మికులు చాలా మంది బురదలో కూరుకపోయారు. శ్రీలంక, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్తో పాటు కేంద్ర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ పేర్కొంది.
మొత్తం 500 మంది మట్టిలో కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తేయాకు తోటల వద్ద నివాసం ఉంటున్న 150 కుటుంబాలకు చెందినవారి ఆచూకీ తెలియడం లేదు. వీరిలో ఎక్కువ మంది మృతి చెంది ఉంటారనే అనుకుంటున్నారు.
ఈ ఘటనలో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని అధికారలు వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలను టీ ఎస్టేట్లో కార్మికులు పని చేస్తున్నారు. మరో 817 మందిని పలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.
భారీ వర్షాలు: లంకలో 200 మంది సజీవ సమాధి
భారీ వర్షాల కారణంగా శ్రీలకంలోని సెంట్రలో బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి.
భారీ వర్షాలు: లంకలో 200 మంది సజీవ సమాధి
భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో అక్కడ నివాసం ఉన్న 150 కుటుంబాలకు చెందిన కార్మికులు చాలా మంది బురదలో కూరుకపోయారు.
భారీ వర్షాలు: లంకలో 200 మంది సజీవ సమాధి
మొత్తం 500 మంది మట్టిలో కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తేయాకు తోటల వద్ద నివాసం ఉంటున్న 150 కుటుంబాలకు చెందినవారి ఆచూకీ తెలియడం లేదు.
భారీ వర్షాలు: లంకలో 200 మంది సజీవ సమాధి
ఈ ఘటనలో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని అధికారలు వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలను టీ ఎస్టేట్లో కార్మికులు పని చేస్తున్నారు. మరో 817 మందిని పలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు.