భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2015 సంవత్సరానికిగానూ భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. తకాకి కజిత (జపాన్), ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ (కెనడా) లకు ఈ పురస్కారం ప్రకటించారు. న్యూట్రినోలు ఎలా పనిచేస్తాయన్న అంశంపై చేసిన పరిశోధనకు గానూ ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారం ప్రకటించారు.
న్యూట్రినోలపై పరిశోధనకు గాను వారికి ఈ అరుదైన పురస్కారం దక్కింది. తకాకి కజిత జపాన్లోని కషివాలో యూనివర్శిటీ ఆఫ్ టోక్యోలో పనిచేస్తున్నారు. ఆర్థర్ బి.మెక్ డొనాల్డ్ కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. న్యూట్రినోస్కి మాస్ ఉంటుందని నిరూపించే న్యూట్రినో ఆసిలేషన్స్ వీరిద్దరూ కనుగొన్నారు.
ఇక ఈ ఏడాది తొలి నోబెల్ పురస్కారాన్ని వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సోమవారం ప్రకటించారు. ఈరోజు భౌతిక రంగంలో ప్రకటించారు. ఈ వారంలోనే రసాయన, శాంతి రంగాల్లో నోబెల్ బహుమతులు ప్రకటిస్తారు. ఆర్థిక విభాగంలో వచ్చే సోమవారం ప్రకటించనున్నారు.
Hearty
congratulations
to
Takaaki
Kajita
and
Arthur
B.
McDonald
for
winning
the
#NobelPrize
in
Physics
2015.
pic.twitter.com/20nCTLUVdp
—
Kailash
Satyarthi
(@k_satyarthi)
October
6,
2015