దొంగ అనుకుని భార్యను తుపాకీతో కాల్చి చంపాడు
శాన్అంటానియో: తమ ఇంట్లో దొంగతనం చేసేందుకు ఎవరో వచ్చారని పొరపడిన ఓ వ్యక్తి తన భార్యపైనే కాల్పులు జరిపి ఆమె మరణానికి కారకుడయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని శాన్అంటానియోలో చోటు చేసుకుంది.
టెక్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాన్ఆంటోనియో ప్రాంత నివాసి డెబోరా కెల్లీ(48) నేషనల్ సర్జికల్ హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. కాగా, ఆమె భర్త లార్స్ ఇజో వ్యాపారి.
ఆదివారం తెల్లవారుఝామున తన ఇంటి బయట ఏవో శబ్దాలు వినపడగా, దాన్ని లార్స్ గమనించాడు. దూరం నుంచి చూస్తే, చీకట్లో ఎవరో తలుపులు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది.
దొంగలు వచ్చారని భావిస్తూ.. తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆపై దగ్గర కెళ్లి చూసి దిగ్ర్భాంతికి గురయ్యాడు. తను కాల్పులు జరిపింది భార్యపైనేనని తెలుసుకుని దిగాలుచెందాడు.
కాగా, ఈ ఘటనలో కెల్లీ అక్కడికక్కడే మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అనుకోని సంఘటన వల్ల తాము మంచి పొరుగువారిని కోల్పోయామని కెల్లీ ఇరుగుపొరుగువారు ఆవేదన వ్యక్తం చేశారు.