ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు వ్యభిచారం కూపంలోకి..
లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తమ అప్పులు తీర్చడానికి, జీవితాన్ని వెళ్లదీయడానికి పలువురు విద్యార్థులు తమ శరీరాన్ని అమ్ముకుంటున్నారు. స్వన్వీయా విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రతీ 20 మంది విద్యార్థుల్లో ఒకరు తమ జీవితాన్ని వెళ్లదీయడానికి వ్యభిచారం కూపంలోకి దిగుతున్నారని నివేదిక పేర్కొంది. యూనివర్సిటీ స్థాయిలో చదువుతున్న విద్యార్థులు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం తెలియకుండానే ఈ కూపంలోకి నెట్టబడుతున్నారని తెలిపింది. విచిత్రమేంటంటే.. అమ్మాయిలకంటే ఎక్కువగా అబ్బాయిలే ఈ కూపంలో దిగుతున్నారు.
లండన్కు చెందిన శాస్త్రవేత్తల బృందం 6,750 విద్యార్థులపై చేపట్టిన ఆన్లైన్ సర్వేలో 5శాతం మంది పురుషులు, 3.5 శాతం అమ్మాయిలు వ్యభిచార కూపంలో పనిచేస్తున్నారని పేర్కొంది. విద్యార్థుల్లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ పని చేస్తుండగా.. మరి కొంత మంది తాము చదువుతున్న కోర్సులకు కావాల్సిన డబ్బుల కోసం వ్యభిచారకూపంలోకి నెట్టబడుతున్నారని సర్వే వెల్లడించింది.
అలాగే ప్రతీ ఐదుగురిలో ముగ్గురు ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో ఈ కూపంలోకి వెళుతున్నారని స్వాన్సియా యూనివర్సిటీ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న ట్రేసీ సాగర్ వెల్లడించారు. వ్యభిచారం కూపంలోకి దిగుతున్న విద్యార్థుల సంఖ్య వేలాలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు కుటుంబసభ్యులకు, సమాజానికి భయపడి ఈ విషయాన్ని బయటపడకుండా చూసుకుంటున్నారని చెప్పారు.