షాక్: జూనియర్ పైలెట్లకు విమానాన్ని వదిలి గుర్రుపెట్టి నిద్రపోయిన పైలెట్
305 మంది ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఓ విమాన పైలెట్. జూనియర్ పైలెట్ కు విమానాన్ని అప్పగించి రెండుగంటలపాటు విమానంలోనే తీరిగ్గా నిద్రపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇస్లామాబాద్: 305 మంది ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఓ విమాన పైలెట్. జూనియర్ పైలెట్ కు విమానాన్ని అప్పగించి రెండుగంటలపాటు విమానంలోనే తీరిగ్గా నిద్రపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పాకిస్తాన్ నుండి లండన్ కు బయలుదేరిన విమానంలో పాక్ కు చెందిన సీనియర్ పైలెట్ అమిర్ అఖ్తర్ హంషీ శిక్షణలో ఉన్న పైలెట్ లకు వదిలేసి రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు.
అక్కడే ఉన్న ఓ ప్రయాణీకుడు అతడు నిద్రపోతున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఈ విషయమై విమానాయాన అధికారులకు కూడ ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన గత నెల 26వ, తేదిన చోటుచేసుకొంది. ఈ ఘటనపై పాక్ అధికారులు విచారణకు ఆదేశించారు.
రెండుగంటలపాటు బిజినెస్ క్లాస్ లో సీనియర్ పైలెట్ బిజినెస్ క్లాస్ లో నిద్రపోయాడు. విమానం టేకాఫ్ అయిపోయిన వెంటనే జూనియర్ పైలెట్లకు వదిలేసి నిద్రపోయాడు.