పాక్ అధ్యక్షుడి కుమారుడి టార్గెట్: ముగ్గురి దుర్మరణం
కరాచీ: పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కుమారుడిని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు బాంబు దాడులు చేశారు. ఈ బాంబు పేలుడులో ముగ్గురు మరణించి పలువురు గాయపడ్డారు. అయితే ఉగ్రవాదులు టార్గెట్ గురి తప్పడంతో హుస్సేన్ కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.
పాకిస్థాన్ అధ్యక్షుడు ముమ్నూర్ హుస్సేన్ కుమారుడు సల్మాన్ ముమ్నూర్ పలు వ్యాపారులు చేస్తున్నారు. సల్మాన్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు. అతను ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు, ఇంటికి ఎప్పుడు తిరి వెలుతున్నాడు అని రెక్కి నిర్వహించారు.
వ్యాపార లావాదేవీలలో భాగంగా సల్మాన్ వెళ్లే మార్గాలను గుర్తించారు. ఆదివారం రాత్రి బాలోచిస్థాన్ ప్రావిన్స్ లోని రెస్టారెంట్ దగ్గర బాంబులు అమర్చిన బైక్ పార్క్ చేశారు. తరువాత కారులో సల్మాన్ అటువైపు వెళ్లారు. అదే సమయంలో ఉగ్రవాదులు రిమోట్ తో బాంబులు అమర్చిన బైక్ ను పేల్చి వేశారు.
అయితే ఈ దాడిలో సల్మాన్ తృటిలో తప్పించుకున్నారు. బాంబు పేలుడుతో ముగ్గురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. 13 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రతగా పాకిస్థాన్ అధ్యక్షుడు హుస్సేన్, ఆయన కుమారుడు సల్మాన్ కు గట్గి భద్రత కల్పించారు.